వార్తలకు తిరిగి వెళ్లండి

ముదినేపల్లి మండలం కోమర్రు రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడిని పెదపారుపూడి మండలం వానపాములకు చెందిన షేక్ నాగుల్ వలి (46)గా స్థానికులు గుర్తించారు.
వెల్డింగ్ పని కోసం సింగరాయపాలెం వెళ్లి సహచరుడి వాహనంపై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను హెడ్ కానిస్టేబుల్ రామారావు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...
