వార్తలకు తిరిగి వెళ్లండి
రామగుండంలో ప్రమాదం: ఇద్దరు బలి

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ క్రషర్నగర్ వద్ద ఆగి ఉన్న లారీని చత్తీస్గఢ్ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు.
క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతుల వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...