వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. డయాలసిస్ సెంటర్ కు ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు.
చికిత్స సమయంలో అత్యవసర పరిస్థితి వస్తే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిపుణులను నియమించి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

