వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపలపల్లికి చెందిన రామ్దేని మల్లేశం(73) పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని ఎస్సై సురేష్ తెలిపారు. మల్లేశం కొంతకాలంగా మోకాళ్ళ నొప్పులతో అవస్థ పడుతూ డాక్టర్లకు చూపించుకుని మందులు వాడిన తగ్గలేదన్నారు. దీంతో మల్లేశం మనస్థాపం చెంది పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడన్నారు.
Comments
Loading comments...