Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభం

Follow Udayam on Google
Anji Aug 19, 2026 6:28 PM నాగర్ కర్నూల్General
ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామానికి గత ఎనిమిదేళ్లుగా బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామస్థుల సమస్యను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ షాలినితో మాట్లాడారు. దీంతో బుధవారం రేవల్లికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునఃప్రారంభించారు.

Comments

G
Loading comments...