వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో ఎస్ఐ రవి చంద్ర కుమార్ ఆధ్వర్యంలో ‘కనెక్ట్ యూత్’ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది పాల్గొన్న ఈ సమావేశంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలని, గ్రామ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ రవిచంద్ర కోరారు.
Comments
Loading comments...

