వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులోని పులవర్తి లక్ష్మణస్వామి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి జాతీయ రహదారి మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు.
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు సూచించారు. అనంతరం మట్టి విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేశారు.
Comments
Loading comments...

