వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 రకాల వరి వంగడాలు సాగు చేస్తున్న రైతులు ఈనెల 10లోపు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చిన్నగూడూరు AO భాస్కర్ సూచించారు.
డీలర్ వద్ద విత్తనం కొనుగోలు చేసిన వారు డీలర్ ద్వారా, ఇతర రైతుల నుంచి విత్తనం పొందిన వారు రైతు ధృవీకరణ పత్రంతో నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసిన రైతులకే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయం, క్వింటాకు రూ.500 బోనస్ లభిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

