వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో జాతీయ అంధత్వ దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించారు.
ఆప్తాల్మిక్ అధికారి ఎం. కె. దాస్ 650 మంది విద్యార్థులను పరీక్షించగా 73 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. వారికి ఉచిత కళ్లద్దాల కోసం సిఫార్సు చేశారు. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించి, మొబైల్ వినియోగాన్ని తక్కువ వినియోగించేలా చేయాలని ప్రిన్సిపల్ పి. సౌజన్య కోరారు.
Comments
Loading comments...

