వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రపురం మండలం ఏనుబరువులో ఆదివారం పోలీసులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా వైద్య శిబిరాన్ని బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు ప్రారంభించారు.
గిరిజనులకు వైద్య సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించడంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. జనరల్, గైనిక్, కంటి, ఎముకలు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఎస్ఐ జ్ఞానప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

