Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవుల కోసం 50 వేల విత్తన బంతులు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 06, 2026 11:19 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
అడవుల కోసం 50 వేల విత్తన బంతులు - Udayam
అడవుల విస్తరణ లక్ష్యంగా చోడవరం అటవీ ప్రాంతాల్లో 50 వేల విత్తన బంతులను జల్లుతున్నట్లు సామాజిక అటవీ పరిధి అధికారి జగదీష్ తెలిపారు. 15 రకాల వృక్షాల విత్తనాలతో వీటిని తయారు చేశారు. ప్రస్తుతం వర్షాలు, భూమిలో తేమ అనుకూలంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీంతో విత్తనాలు మొలకెత్తుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...