వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరి పుష్కరాలకు రూ.50 కోట్లు

గోదావరి పుష్కరాల సమర్థ నిర్వహణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిసింది. అదేవిధంగా ‘నేతన్నల సేవలో’ పథకం కింద చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ కీలక నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ పథకాల ద్వారా అర్హులైన వారికి త్వరలోనే లబ్ధి చేకూరనుంది.
Comments
Loading comments...