వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలో 350కి పైగా గణేష్ విగ్రహాలను అబ్బిరెడ్డిపల్లె చెరువులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమితి అధ్యక్షుడు ఫణిరాజ్, కార్యదర్శులు సందు వెంకటరమణ, వై. హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఫణిరాజ్ దంపతులు గంగా హారతి నిర్వహించిన అనంతరం తరలివచ్చిన వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేశారు.
Comments
Loading comments...

