Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 నిమిషాల్లో 28 లడ్డూలు తిని విజేతగా నిలిచిన వ్యక్తి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:44 PM జాతీయంGeneral
30 నిమిషాల్లో 28 లడ్డూలు తిని విజేతగా నిలిచిన వ్యక్తి - Udayam
గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా తర్ణేతర్‌ జాతరలో నిర్వహించిన రూరల్ ఒలింపిక్స్ లడ్డూల పోటీల్లో ఓరి గ్రామానికి చెందిన బల్వంత్‌భాయ్‌ రాఘ్వనీ విజేతగా నిలిచారు. నిర్దేశిత 30 నిమిషాల వ్యవధిలో 28 లడ్డూలు తిని మొదటి స్థానం దక్కించుకున్న ఆయనకు నిర్వాహకులు రూ.2 వేల నగదు బహుమతి అందజేశారు. వరుసగా రెండేళ్లుగా తాను ఈ పోటీలో గెలుపొందినట్లు బల్వంత్‌భాయ్ తెలిపారు.

Comments

G
Loading comments...