వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం(పెద్దపల్లి): బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించి, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. జులై 1 నాటికే కాలపరిమితి ముగిసినా కోల్ ఇండియా స్పందించకపోవడం దారుణమన్నారు. చర్యలు తీసుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు.
Comments
Loading comments...

