వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాసలోని శ్రీ లలితాదేవి దేవాలయంలో వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా 108 శ్రీచక్ర యంత్రాలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, అష్టోత్తర నామ పూజ, మంగళహారతి నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పూజలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. దీనికై ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

