వార్తలకు తిరిగి వెళ్లండి

బక్రీద్ సందర్భంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ గోరక్షక సంఘాలతో సమావేశమయ్యారు. అక్రమ పశు రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు చెప్పాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు పెంచేలా వీడియోలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర సరిహద్దుల్లో పకడ్బందీ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
Comments
Loading comments...

