వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమష్టిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తామని, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తే తమకు కొలమానమని కలెక్టర్ల సదస్సులో ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, వారానికో కొత్త కంపెనీ వస్తోందని చంద్రబాబు తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని, అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మళ్ళీ అగ్రగామిగా నిలుపుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

