వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర 6 శాతం పెరిగి 120 డాలర్లకు చేరింది. 2022 తర్వాత ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
ఒకవేళ ఉద్రిక్తతలు కొనసాగితే ధర 140 డాలర్లకు చేరవచ్చని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్ కొత్త ఆయుధాల ప్రయోగానికి సిద్ధమవగా, అణు ఒప్పందం కుదిరే వరకు వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

