వార్తలకు తిరిగి వెళ్లండి
వైఎస్సార్కు ఘన నివాళులు

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, భారతిరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తరలివచ్చిన అభిమానులు, నేతలు సంక్షేమ ప్రదాతగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వైఎస్సార్ అమర్ రహే నినాదాలతో ఇడుపులపాయ ప్రాంగణం మార్మోగింది.
Comments
Loading comments...