వార్తలకు తిరిగి వెళ్లండి
భార్య వేధింపులతో యువకుడి బలి

భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులు తాళలేక పెళ్లైన రెండు నెలలకే సదర్లాల్ (27) అనే యువకుడు సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో పడే ముందు అతను గడ్డిమందు తాగినట్లు ఆధారాలు లభించాయి.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన భార్యకు వేరే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆ కారణంతోనే నిత్యం అవమానించేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...