వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలోని రాజేంద్రనగర్లో పానీపూరీ బండి వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు యువతులతో అసభ్యంగా ప్రవర్తించి హంగామా సృష్టించాడు. యువతులను వేధించడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Loading comments...
