Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు నమోదుపై యువతకు అవగాహన

Follow Udayam on Google
రవళి దేవి Jul 02, 2026 5:59 PM నల్గొండGeneral
ఓటు నమోదుపై యువతకు అవగాహన - Udayam
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సాంస్కృతిక సారధి నాయకుడు ఇరిగి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చిరుమర్తి గ్రామంలో కళా ప్రదర్శనల ద్వారా ఓటు విలువపై యువతకు అవగాహన కల్పించారు. బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా, అర్హులైన వారు బీఎల్ఓల సహకారంతో వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...