వార్తలకు తిరిగి వెళ్లండి
వేతనాల కోసం కార్మికుల నిరసన

మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నేత దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
పెరిగిన వేతనాలు, ఇన్సూరెన్స్ మరియు బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...