వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ నిరసన

హరీశ్రావు అరెస్టును నిరసిస్తూ నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ నేతలు మంత్రుల దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.
చర్చలకు పిలిచి పారిపోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేదని వారు విమర్శించారు.
Comments
Loading comments...