వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య సిబ్బంది కీలకపాత్ర పోషిస్తారని, పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా దివ్యౌషధమని యోగా శిక్షకురాలు పెనుమర్తి ప్రశాంతి అన్నారు. బుధవారం విష్ణు యోగా కేంద్రం ఆధ్వర్యంలో మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఉదయం, సాయంత్రం గంట పాటు యోగా సాధన చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

