వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు ఉల్లంఘించినందుకు మహారాష్ట్రకు చెందిన 'యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్' లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. మంగళవారం నుంచి బ్యాంక్ అన్ని రకాల బ్యాంకింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు. ఇకపై ఆ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదని, రుణాల చెల్లింపులు చేపట్టకూడదని అధికారులు వెల్లడించారు. బ్యాంకింగ్ సేవలు తక్షణమే నిలిచిపోయాయని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.
Comments
Loading comments...

