వార్తలకు తిరిగి వెళ్లండి
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం

ఈనెల 11న ఉదయం 11:37 గంటలకు యాదగిరిగుట్ట ఆలయ బంగారు వాకిలి వద్ద ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఎం.సత్యనారాయణ రెడ్డి చైర్మన్గా, ఇతర సభ్యులతో ఈ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని, మీడియాకు అనుమతి లేదని ఈవో పేర్కొన్నారు. అయితే, వీఐపీలకు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్థానికంగా భిన్నమైన చర్చ సాగుతోంది.
Comments
Loading comments...