వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత కేసీఆర్ హయాంలో పంట నష్టపరిహారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
రైతు భరోసా కింద వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. త్వరలోనే నిర్వహించబోయే రైతు ఆశీర్వాద సభకు అన్నదాతలు పెద్ద ఎత్తున తరలిరావాలని భట్టి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...