వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం సిద్ధార్థ ఒకేషనల్ కాలేజీలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయని షీ టీం ఎస్ఐ రమాదేవి అన్నారు.
ఉద్యోగం కేవలం డబ్బు సంపాదనకే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు. విద్యార్థినులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

