వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మదనాపురం సమీపంలోని చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు రంధి దేముడమ్మ(56)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా, లేక ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...
