వార్తలకు తిరిగి వెళ్లండి
హీటర్ షాక్తో మహిళ మృతి

మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ వాడుతున్న సమయంలో కరెంట్ షాక్కు గురై స్వాతి(40) అనే మహిళ మృతి చెందింది. ఘటన సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉండటం విషాదం నింపింది.
భర్త ఉద్యోగానికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...