వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ–20 పెట్రోల్తో పాత వాహనాల్లో మైలేజీ తగ్గడం, ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ–10 పెట్రోల్ను తిరిగి అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వం, చమురు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
2023కు ముందు వాహనాలకు ప్రత్యామ్నాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే వేర్వేరు ఇంధనాల సరఫరాతో రవాణా, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
Comments
Loading comments...

