Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నులు కట్టేందుకు వస్తే.. అధికారులు ఎక్కడ?

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:16 AM ఏలూరుGeneral
పన్నులు కట్టేందుకు వస్తే.. అధికారులు ఎక్కడ? - Udayam
ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో పన్నులు స్వీకరించాల్సిన అధికారులు సమయానికి హాజరుకాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 10.30 దాటినా పన్నుల విభాగంతో పాటు అకౌంట్స్‌ శాఖలో పలువురి కుర్చీలు ఖాళీగా కనిపించాయి. పన్నులు చెల్లించేందుకు వచ్చిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు అధికారులు సమయపాలన పాటించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...