వార్తలకు తిరిగి వెళ్లండి
రైవాడ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

ఖరీఫ్ వరి సాగు కోసం రైవాడ జలాశయం నుంచి 250 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విడుదల చేశారు. కుడి కాల్వ ద్వారా 100, ఎడమ కాల్వ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరారు. నీటి విడుదలకు ముందు అధికారులతో కలిసి గంగాదేవికి జలహారతి ఇచ్చారు.
Comments
Loading comments...