వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీనది తీరాన ఉన్న శివకేశవాలయం కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడంగా నిలుస్తోంది. వరంగల్లోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉండటం ఆలయ ప్రత్యేకత. కాకతీయులు విజయానికి గుర్తుగా నిర్మించినట్లు చెబుతున్నారు.
ఆలయంలో శివకేశవులతో పాటు రేణుకామాత విగ్రహాలు కొలువుదీరాయి. ఆనాటి శిల్పకళా వైభవం నిర్మాణంలో కనిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర, రథోత్సవం నిర్వహిస్తారు.
Comments
Loading comments...

