వార్తలకు తిరిగి వెళ్లండి

యువత గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జాతీయ భావనతో దేశ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రణుతి జూనియర్ కళాశాలలో వి.హెచ్.పి, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై అవగాహన కల్పించారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. రాజు, మనోహర్ గౌడ్, సైఫుద్దీన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

