Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస విషాదాలు.. శోకసంద్రంలో పార్డి (బి)

Follow Udayam on Google
Naresh Sep 05, 2026 10:05 PM నిర్మల్General
కుబీర్ మండలంలోని పార్డి(బి) గ్రామాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గ్రామానికి చెందిన గుడాల సాయినాథ్ (47) బ్రహ్మేశ్వర్ జలపాతం గుండంలో మునిగి మృతి చెందాడు. శ్రావణ శనివారం సందర్భంగా శివాలయం దర్శనానికి వెళ్లిన ఆయన స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే నలుగురు గ్రామస్థులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన విషాదం నుంచి తేరుకోకముందే మరో ప్రాణం పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...