వార్తలకు తిరిగి వెళ్లండి
భామిని మండలం బత్తిలి హైస్కూల్ రోడ్డులో వర్షపు నీరు నిల్వ ఉండి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచిపోయి, వెళ్లే దారి లేక రోజుల తరబడి బురద అలాగే ఉంటోందన్నారు.
దీనివల్ల దోమల వ్యాప్తి పెరిగి రోగాల బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

