వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ పెద్దగుట్ట స్వయంభు శ్రీ ఉగ్ర నరసింహ స్వామికి గ్రామస్తులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పురోహితుల ఆధ్వర్యంలో వరద పాశం కార్యక్రమం చేపట్టి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దాసరి పురుషోత్తం, ఉపసర్పంచ్ చిరుత ప్రభాకర్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

