Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత అవసరం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 6:38 PM ఆదిలాబాద్General
వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత అవసరం - Udayam
ఆదిలాబాద్‌: గ్రామీణ ఆదిలాబాద్‌ మండలం బంగారిగూడలో వైద్య శిబిరం, డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్‌ దాసరి కృష్ణవేణి ఆధ్వర్యంలో 58 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వర్షాకాల వ్యాధులపై అవగాహన కల్పించారు. నిల్వ నీటిని తొలగించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆరోగ్య సహాయకుడు పవర్‌ ప్రేమ్‌సింగ్‌, ఆశా కార్యకర్త పుష్పలత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...