వార్తలకు తిరిగి వెళ్లండి

వరి పంటలో కలుపు నివారణకు నూకలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్నెపల్లి సింహాద్రి నాయుడు అన్నారు. తెర్లాం మండలం నందిగాం రైతులకు అవగాహన కల్పించారు. ఎకరానికి 50 కిలోలు నూకల చల్లినట్లయితే కలుపు మొక్కలు రావు అన్నారు.
రైతులు ఈ పద్ధతి పాటిస్తే వరి పంటలో కలుపు రాకుండా నివారించు కోవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రతీ ఒక్క రైతు దృష్టి సారించాలని కోరారు.
Comments
Loading comments...

