Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెన వద్ద పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
p.g.murthy Aug 28, 2026 9:34 AM మంచిర్యాలGeneral
వంతెన వద్ద పొంచి ఉన్న ప్రమాదం - Udayam
జన్నారం మండలంలోని మొర్రిగూడ శివారులో ఉన్న వాగు వంతెన వద్ద ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వాగు సమీపంలోని ప్రధాన రహదారి భూమి కోతకు గురి అవుతోంది. రోడ్డుపై వాహనాలు వెళ్లే సందర్భంలో ఎదురుగా మరో వాహనం వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు వాపోయారు. వాహనాలు అదుపుతప్పి నేరుగా వాగులో పడిపోయే అవకాశం ఉంటుందని, అధికారులు మరమ్మత్తులు చేయించాలన్నారు.

Comments

G
Loading comments...