వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం: ఇటీవల మృతి చెందిన కాశిన వనితకు వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మంగళవారం పట్టణంలో దండివీధిలోని ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రంగాజీ దేవ్, నక్క రామరాజు, గుంటముక్కల పాపారావు, కింజరాపు రమేష్, జగదీష్, సున్నా శ్రీనివాసరావు, వడ్డి ఉదయ్, సాహు శ్రీను, నాని, అప్పు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
