Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనిత కుటుంబాన్ని పరామర్శించిన ధర్మాన రామ్మనోహర్ నాయుడు

Follow Udayam Digital on Google
RAGHU Jul 28, 2026 10:15 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
వనిత కుటుంబాన్ని పరామర్శించిన ధర్మాన రామ్మనోహర్ నాయుడు - Udayam Digital
శ్రీకాకుళం: ఇటీవల మృతి చెందిన కాశిన వనితకు వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మంగళవారం పట్టణంలో దండివీధిలోని ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రంగాజీ దేవ్, నక్క రామరాజు, గుంటముక్కల పాపారావు, కింజరాపు రమేష్, జగదీష్, సున్నా శ్రీనివాసరావు, వడ్డి ఉదయ్, సాహు శ్రీను, నాని, అప్పు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...