వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో పాతకక్షల నేపథ్యంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓ వ్యక్తికి సుమారు 40 కుట్లు పడినట్లు సమాచారం.
వినాయక విగ్రహాల ఏర్పాటు విషయంలో గొడవకు ఆజ్యం పోశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకులు ఘర్షణకు దిగడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

