Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్‌ఐ

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 2:54 PM ప్రకాశం General
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్‌ఐ - Udayam
కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 32 గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక చవితి మండపాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్‌ఐ కోటయ్య గురువారం తెలిపారు. ఊరేగింపులు, భారీ శబ్దాలతో డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...