Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక స్థావరంపై విక్రమ్ మిస్రీ

మానస శర్మ Jun 29, 2026 12:51 PM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago
సెషెల్స్‌లోని అజంప్షన్ ఐలాండ్‌లో భారత్ సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందన్న వార్తలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. సెషెల్స్ ప్రభుత్వమే ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువస్తే చర్చించడానికి భారత్ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టయినా సెషెల్స్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...