వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.70 లక్షల వసూళ్ల కేసు: టీఎంసీ మాజీ కౌన్సిలర్ అరెస్ట్

కోల్కతా మాజీ మేయర్ ఫిర్హాద్ హకీమ్ సన్నిహితుడు, టీఎంసీ మాజీ కౌన్సిలర్ శ్యామ్స్ ఇక్బాల్ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో ఓ వ్యాపారిని బెదిరించి రూ.70 లక్షలు వసూలు చేశారనే ఫిర్యాదు మేరకు గార్డెన్ రీచ్ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
వ్యాపారి ఎండీ షాదాబ్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్స్ ఇక్బాల్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...