వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో నిర్మాణ దశలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ లో విద్యుత్ షాక్ గురై నాగార్జున అనే పెయింటర్ మృతి చెందాడు.
మున్సిపల్ పరిధిలోని కోట్నూరు చెందిన నాగార్జున పెయింటింగ్ కూలి పని చేస్తుండగా, కింద పడ్డ ఓ విద్యుత్ వైరు తగిలి కింద పడిపోయాడు. తోటి పనివారు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Comments
Loading comments...

