వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ కిరాణం షాప్ వద్ద ప్రకటన బోర్డు అమరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి హైదరాబాద్ మౌలాలికి చెందిన షేక్ అర్షద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

